ఏపీలో 4 కరోనా మరణాలు..

- June 03, 2020 , by Maagulf
ఏపీలో 4 కరోనా మరణాలు..

అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066 శాంపిల్స్‌ను పరీక్షించగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94మంది .. విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల సంఖ్య 180 నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్-19 వల్ల నలుగురు చనిపోయారు.. చిత్తూరు జిల్లాలో ఇద్దరు.. కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3279కు చేరాయి. మరో 35మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 967కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తోంది. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com