మస్కట్:నిర్బంధ శిబిరాల నుంచి రవాణా సర్వీసులు కొనసాగిస్తున్న మవసలాత్

- June 03, 2020 , by Maagulf
మస్కట్:నిర్బంధ శిబిరాల నుంచి రవాణా సర్వీసులు కొనసాగిస్తున్న మవసలాత్

మస్కట్:కోవిడ్ 19పై పోరాటానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా జాతీయ రవాణా సంస్థ మవసలాత్ తమ సేవలను కొనసాగిస్తోంది. విదేశాల నుంచి వస్తున్న వచ్చే పౌరులను విమానశ్రయం నుంచి నిర్బంధ శిబిరాలకు(క్వారంటైన్ సెంటర్స్) కు తరలిస్తోంది. అలాగే నిర్బంధ శిబిరాల నుంచి ప్రజలను వారి ఇంటివద్దకు చేరుస్తోంది. ప్రభుత్వ చర్యలకు సాయంగా ఈ సేవలను కొనసాగిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. మార్చి 23 నుంచి జూన్ 1 వరకు మొత్తం 3,097 మందిని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్వారంటైన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు. అలాగే 1,109 మందిని క్వారంటైన్ సెంటర్ల నుంచి వారి ఇంటికి చేరవేసినట్లు ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com