కువైట్ సంచలన నిర్ణయం..
- June 05, 2020
కువైట్ సిటీ:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భవిష్యత్తులో చాలా మార్పులకు తెరలేపుతోంది. ఉపాధి కోసం దేశాలు దాటి వెళ్లిన వలస కార్మికులు మళ్లీ పొట్ట చేతబట్టుకుని స్వదేశానికి తిరిగి రావలసిన పరిస్థితులు దాపురించనున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న వలస కూలీల సంఖ్యను 30 శాతానికి తగ్గించాలని కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ సబా నిర్ణయించారు. వైరస్ ప్రభావంతో చమురు ధరలు భారీగా పడిపోయాయి. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది.
ఈ నేపథ్యంలో అనేకమంది తమ ఉపాధిని కోల్పోవలసి వస్తోంది. దాంతో కువైట్ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలంటే ప్రవాసుల సంఖ్యను తగ్గించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది ప్రభుత్వానికి. కాగా, కువైట్ మొత్తం జనాభా 48 లక్షలు ఉంటే అందులో విదేశీయులే 34 లక్షల మంది ఉన్నారు. ఇందులో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ లకు చెందినవారే అధికమని కువైట్ ప్రధాని పేర్కొన్నారు. కువైట్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతదేశానికి చెందిన లక్షల మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా ఇళ్లలో పని చేస్తుంటారు. వీరే 6.5 లక్షల మంది ఉన్నారని అంచనా.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







