జూన్ 10న కువైట్ నుంచి ఇండియాకి తొలి చార్టర్డ్ ఫ్లైట్
- June 08, 2020
కువైట్ సిటీ:తొలి చార్టర్డ్ ఫ్లైట్ కువైట్ నుంచి ఇండియాలోని కోజికోడ్కి బయల్దేరనుంది. జూన్ 10న ఈ విమానం బయల్దేరనుంది. ఎన్నారై ఆర్గనైజేషన్ ఈ మేరకు చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తోంది. కువైట్ కేరళ ముస్లిం అసోసియేషన్ (కెకెఎంఎ) తమ తొలి చార్టర్డ్ విమానాన్ని జూన్ 10న కోజికోడ్కి ఏర్పాటు చేసింది. ఐటీఎల్ వరల్డ్ ట్రావెల్ కంపెనీతో కలిసి ఈ చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన అనుమతులు సంపాదించడం జరిగిందనీ, చార్టర్డ్ విమానంలో తొలి ప్రాధాన్యత ప్రెగ్నెంట్ మహిళలకు, సిక్ పర్సన్స్, వీసా గడువు తీరినవారికి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ఇండియాకి వెళుతున్నవారికి ఇవ్వనున్నారు. కేరళకే చెందిన మరో ఎన్నారై ఆర్గనైజేషన్ ‘కెఎఎల్ఎ) కూడా మరో చార్టర్డ్ విమానాన్ని కువైట్ ఎయిర్ వేస్తో కలిసి జూన్ 12న ఏర్పాటు చేస్తోంది. కాగా, ఓఐసిసి కువైట్ మరియు బదుర్ ట్రావెల్స్ సంయుక్తంగా మరో చార్టర్డ్ విమానాన్ని జజెరా ఎయిర్ వేస్ ద్వారా కోచికి జూన్ 12న ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







