జూన్ 10న కువైట్ నుంచి ఇండియాకి తొలి చార్టర్డ్ ఫ్లైట్
- June 08, 2020
కువైట్ సిటీ:తొలి చార్టర్డ్ ఫ్లైట్ కువైట్ నుంచి ఇండియాలోని కోజికోడ్కి బయల్దేరనుంది. జూన్ 10న ఈ విమానం బయల్దేరనుంది. ఎన్నారై ఆర్గనైజేషన్ ఈ మేరకు చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తోంది. కువైట్ కేరళ ముస్లిం అసోసియేషన్ (కెకెఎంఎ) తమ తొలి చార్టర్డ్ విమానాన్ని జూన్ 10న కోజికోడ్కి ఏర్పాటు చేసింది. ఐటీఎల్ వరల్డ్ ట్రావెల్ కంపెనీతో కలిసి ఈ చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన అనుమతులు సంపాదించడం జరిగిందనీ, చార్టర్డ్ విమానంలో తొలి ప్రాధాన్యత ప్రెగ్నెంట్ మహిళలకు, సిక్ పర్సన్స్, వీసా గడువు తీరినవారికి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ఇండియాకి వెళుతున్నవారికి ఇవ్వనున్నారు. కేరళకే చెందిన మరో ఎన్నారై ఆర్గనైజేషన్ ‘కెఎఎల్ఎ) కూడా మరో చార్టర్డ్ విమానాన్ని కువైట్ ఎయిర్ వేస్తో కలిసి జూన్ 12న ఏర్పాటు చేస్తోంది. కాగా, ఓఐసిసి కువైట్ మరియు బదుర్ ట్రావెల్స్ సంయుక్తంగా మరో చార్టర్డ్ విమానాన్ని జజెరా ఎయిర్ వేస్ ద్వారా కోచికి జూన్ 12న ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









