భారత్ లో 3 లక్షలు దాటిన కరోనా కేసులు..
- June 13, 2020
భారత్లో వైరస్ వ్యాప్తి పెరగడంతో ప్రతి రోజు వేలాది మంది వ్యాధిబారిన పడుతున్నారు. ఇప్పటి వరకు 10 వేల వరకు నమోదైన కేసులు.. తాజాగా 11 వేలు దాటిపోయాయి. తాజాగా గడిచిన 24 గంటల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం నిన్న ఒక్కరోజే ఏకంగా 11,458 మందికి కొత్తగా కరోనా సోకింది. 386 మంది మరణించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి.
కాగా తాజా గణాంకాలతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 3,08,993 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. వీరిలో 8,884 వైరస్ కాటుకు బలయయారు. దాదాపు 1,54,330 మంది కోలుకోగా.. ఇంకా 1,45,779 మందికి ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10 రోజుల క్రితం వరకు 2 లక్షలు ఉన్న కేసులు కేవలం అతి తక్కువ సమయంలోనే 3 లక్షలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 101,141, ఢిల్లీ 36,824, తమిళనాడు 40,000, గుజరాత్ 22,525 మందికి కరోనా సోకిందని తాజా లెక్కలు తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







