టూరిస్ట్ ఎట్రాక్షన్స్లో షేక్ మొహమ్మద్ పర్యటన
- June 13, 2020
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్లోని పలు టూరిస్ట్ ఎట్రాక్షన్స్లో పర్యటించారు. అక్కడి సౌకర్యాల్ని పరిశీలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని రోజులపాటు టూరిస్ట్ ఎట్రాక్షన్స్ మూసివేసిన దరిమిలా, ఇటీవల సడలింపుల తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల్ని పరిశీలించారు షేక్ మొహమ్మద్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. జుమైరా అంతటా ఆయన పర్యటించారు. బీచ్లో ఏర్పాట్లనూ పరిశీలించారు. కాగా, దుబాయ్లో కేఫ్లు, రెస్టారెంట్లు, జిమ్ లు, పార్కులు మరియు షాపింగ్ మాల్స్ని ఇటీవల పునఃప్రారంభించిన విషయం విదితమే. జీవితం కొనసాగుతూనే వుంటుంది.. జీవితంలో ఓ ఫేజ్ ముగిశాక ఇంకో ఫేజ్ ప్రారంభమవుతుందని తెలుసుకున్నాను.. అంటూ షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







