ఏపీలో మరో 186 కరోనా పాజిటివ్‌ కేసులు

- June 13, 2020 , by Maagulf
ఏపీలో మరో 186 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో  గడిచిన 24 గంటల్లో 186 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14,477 శాంపిల్స్‌ని పరీక్షించగా 186 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణ లో ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 4588. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 82. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,641కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1865 మంది చికిత్స పొందుతున్నారు.


--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com