సౌదీ తూర్పు ప్రాంతంలో భారీగా ఆరోగ్య భద్రత నిబంధనల ఉల్లంఘనలు
- June 13, 2020
సౌదీ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా అధికారులు చేపడుతున్న తనిఖీల్లో ప్రజలు, భారీగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. తూర్పు ప్రాంతంలోని మున్సిపాలిటీల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో వందల సంఖ్యలో తనిఖీలు చేపట్టారు. అల్ నాయిర్ గవర్నరేట్ పరిధిలో అధికార బృందాలు మొత్తం 649 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 48 మంది కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించగా.. మాల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి జనం గుమికూడటం వంటి 75 కేసులు నమోదయ్యాయి. అలాగే కార్మికులు ఉండే చోట్ల కూడా పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ఉన్న ఘటనలు మూడు చోట్ల చోటు చేసుకున్నాయి. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. ఇదిలాఉంటే గడువు ముగిసిన 6,272 ఆహార పదార్ధాలను నాశనం చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







