కువైట్:నిర్బంధ, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 12 మందిపై కేసు నమోదు
- June 13, 2020
కువైట్:కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న కొందరు మాత్రం వైరస్ ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణకు తప్పనిసరిగా నిర్బంధంలో ఉండాల్సిన 12 మంది వ్యక్తులు అందుకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 10 మంది కువైట్ కు చెందిన వారు కాగా..ఇద్దరు ప్రవాసీయులు ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఏడుగురు గృహనిర్బంధం ఉండాల్సి ఉంది. కానీ, వారు రూల్స్ పాటించకుండా పబ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతూ పట్టుబడ్డారు. మరో ఐదురుగు కర్ఫ్యూ రూల్స్ పాటించకుండా పట్టుబడ్డారు. ఇందులో ముగ్గురు కువైట్ క్యాపిటల్ లో పట్టుబడగా..ఒకరు హవల్లి, ముబారక్ అల్ కబీర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ 12 మందిపై కేసును నమోదు చేసిన అధికారులు తదుపరి న్యాయవిచారణకు తరలించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







