కువైట్:నిర్బంధ, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 12 మందిపై కేసు నమోదు
- June 13, 2020
కువైట్:కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న కొందరు మాత్రం వైరస్ ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణకు తప్పనిసరిగా నిర్బంధంలో ఉండాల్సిన 12 మంది వ్యక్తులు అందుకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 10 మంది కువైట్ కు చెందిన వారు కాగా..ఇద్దరు ప్రవాసీయులు ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఏడుగురు గృహనిర్బంధం ఉండాల్సి ఉంది. కానీ, వారు రూల్స్ పాటించకుండా పబ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతూ పట్టుబడ్డారు. మరో ఐదురుగు కర్ఫ్యూ రూల్స్ పాటించకుండా పట్టుబడ్డారు. ఇందులో ముగ్గురు కువైట్ క్యాపిటల్ లో పట్టుబడగా..ఒకరు హవల్లి, ముబారక్ అల్ కబీర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ 12 మందిపై కేసును నమోదు చేసిన అధికారులు తదుపరి న్యాయవిచారణకు తరలించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







