తెలంగాణలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు

- June 13, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4737కు చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు విదేశాల నుంచి వచ్చిన 449 మంది ఉన్నారు. కరోనా కారణంగా నేడు మరో 8 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 182కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2203గా ఉంది. వైరస్ నుంచి 2352 మంది కోలుకున్నారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com