సుశాంత్ మరణ వార్త విని ఆయన మరదలు కూడా...
- June 16, 2020
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త యావత్ సినీ ఇండస్ట్రీని కలచివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ అంత్యక్రియలు జరిగి 24 గంటలు కాకముందే ఆయన మరదలు (సుశాంత్ కజిన్ భార్య) సుధా దేవి బీహార్ లోని పుర్నియాలో తుది శ్వాస విడిచింది. ముంబయిలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినప్పటి నుండి ఆమె ఆహరం తీసుకోవడం మానేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







