సుశాంత్ మరణ వార్త విని ఆయన మరదలు కూడా...
- June 16, 2020
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త యావత్ సినీ ఇండస్ట్రీని కలచివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ అంత్యక్రియలు జరిగి 24 గంటలు కాకముందే ఆయన మరదలు (సుశాంత్ కజిన్ భార్య) సుధా దేవి బీహార్ లోని పుర్నియాలో తుది శ్వాస విడిచింది. ముంబయిలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినప్పటి నుండి ఆమె ఆహరం తీసుకోవడం మానేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







