సుశాంత్ మరణ వార్త విని ఆయన మరదలు కూడా...
- June 16, 2020
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త యావత్ సినీ ఇండస్ట్రీని కలచివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ అంత్యక్రియలు జరిగి 24 గంటలు కాకముందే ఆయన మరదలు (సుశాంత్ కజిన్ భార్య) సుధా దేవి బీహార్ లోని పుర్నియాలో తుది శ్వాస విడిచింది. ముంబయిలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినప్పటి నుండి ఆమె ఆహరం తీసుకోవడం మానేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







