షార్జా:విధుల పునరుద్ధరణకు వీలుగా 5000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా టెస్టులు
- June 16, 2020
షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధులకు హజరుకానున్నారు. సిబ్బందిలో 30 శాతం మంది ఆఫీసులకు రావాలని షార్జా మానవ వనరుల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది ఎంప్లాయిస్ కి టెస్టులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. విధులకు హజరయ్యే ఉద్యోగుల భద్రతతో పాటు ఆయా కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఐదు నిమిషాల్లోనే శాంపుల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టెస్ట్ ఫలితాలు 72 గంటల్లో వస్తాయని, నేరుగా ఉద్యోగి మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా పరీక్ష ఫలితాలను చేరుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







