మస్కట్:వేర్వేరు చోరీల కేసుల్లో ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
- June 18, 2020
ఒమన్ లో వేర్వేరుగా చోటుచేసుకున్న చోరీల కేసులలో ఆరుగురు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర అల్ బటినా గవర్నరేట్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఘటనలో మొబైల్ స్టోర్ నుంచి మొబైల్స్ దొంగించిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. ఈ ఇద్దరిపై చోరీతో పాటు మోసానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే దక్షిణ అల్ షార్కియా గవర్నరేట్ పరిధిలో పశువుల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జలన్ బని బు అలీ ప్రాంతంలో 11 పశువులను ముగ్గురు నిందితులు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







