విజయవంతంగా గల్వాన్ నదిపై వంతెన నిర్మించిన భారత ఆర్మీ
- June 19, 2020
గల్వాన్ నదిపై వంతెన నిర్మాణాన్ని అడ్డుకోడానికి చైనా ఎన్ని కుయుక్తులు చేసినా ఫలించలేదు. చైనాపై భారత్ పైచేయి సాధించింది. గల్వాన్ నదిపై 60 మీటర్ల వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేనట్లు మన ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే తమ పప్పులేమీ ఉడకవని భావించిన చైనా.. దీన్ని అడ్డుకోడానికి లెక్కలేనన్ని కుట్రలు చేసింది. అయినాసరే మన ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు చెందిన ఇంజనీర్లు ఏమాత్రం భయపడకుండా పనులు కంటిన్యూ చేయడంతో చివరి ప్రయత్నంగా ఈ నెల 14న దారుణానికి ఒడిగట్టింది. మన 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంది. తన పంతం నెగ్గించుకోడానికి చైనా ఎంతకైనా తెగిస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈ బ్రిడ్జి పూర్తికావడంతో గల్వాన్ లోయలో మన సైన్యం పట్టు సాధించడానికి వీలు చిక్కింది.
గల్వాన్ నదిపై బ్రిడ్జి ష్యోక్ నది, గాల్వన్ నది సంగమానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అటు పెట్రోలింగ్ పాయింట్ 14కు సమీపంలోని బైలీ వెంతెనకు తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్త వంతెన నిర్మాణానికి ముందు కాలి నడక వంతెన ఉండేది. దీనిపై నుంచి దాటడానికి సైనికులకు ఇబ్బందులు తప్పేవి కావు. ప్రస్తుతం కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించడంతో ఈజీగా గల్వాన్ లోయ ఆవలివైపు చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు గల్వాన్ నదీ ప్రాంతంతో పాటు డార్బుక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ వరకు ఉన్న 255 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారిని కూడా కాపాడుకోవచ్చు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







