తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
- June 19, 2020
హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం ఒక్క రోజే 499 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 6,525కి పాజిటివ్ కేసులు చేరాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి 198 మందిని పొట్టన పెట్టుకుంది. అధికారులు లెక్కల ప్రకారం 2976 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 3352 మంది డిశ్చార్జ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. రెండు రోజులుగా GHMC పరిధిలో 300 మార్కును కరోనా కేసులు దాటేస్తున్నాయి. ఇప్పటివరకు GHMC పరిధిలో 4526 కు కరోనా కేసులు చేరాయి. దీంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా కేసులూ భారీగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 50,569 కరోనా టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







