దోహా:ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు..నిబంధనలు పాటించని వారికి జరిమానా విధింపు
- June 20, 2020
దోహా:ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు..దేశంలో పలు ఆరోగ్య సేవా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం, కార్మికుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ కేంద్రాలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను, నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 65 ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో మూడు జనరల్ మెడికల్ కాంప్లెక్స్, 14 కంపెనీ క్లినిక్స్ లు, 48 ప్రాధమిక చికిత్స కేంద్రాలు ఉన్నాయి. అయితే..అధికారుల తనిఖీల్లో దాదాపు 81 ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని హెచ్చరించటంతో పాటు జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







