దోహా:ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు..నిబంధనలు పాటించని వారికి జరిమానా విధింపు
- June 20, 2020
దోహా:ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు..దేశంలో పలు ఆరోగ్య సేవా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం, కార్మికుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ కేంద్రాలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను, నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు అధికారులు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 65 ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో మూడు జనరల్ మెడికల్ కాంప్లెక్స్, 14 కంపెనీ క్లినిక్స్ లు, 48 ప్రాధమిక చికిత్స కేంద్రాలు ఉన్నాయి. అయితే..అధికారుల తనిఖీల్లో దాదాపు 81 ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని హెచ్చరించటంతో పాటు జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







