దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు
- June 21, 2020దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ కొంతమంది ఔత్సాహికులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ మిషన్ ఈ కార్యక్రమాన్ని తన సోషల్ మీడియా సైట్స్లో గంటసేపు ప్రత్యక్షప్రసారం చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్-19 విపత్కర పరిస్థితుల నుండి బయటకు రావడంలో యోగా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. యూఏఈలోని వివిధ కమ్యూనిటీస్ ఈ సారి యోగా కార్యక్రమాన్ని వర్చువల్గా జరపడానికి ముందుకు వచ్చినట్లు విపుల్ పేర్కొన్నారు. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి’ పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు వర్చువల్గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?