50 శాతం కెపాసిటీతో షార్జా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ
- June 22, 2020
షార్జా:షార్జాలో ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం కెపాసిటీతో ప్రారంభమయిన విషయం విదితమే. ఈ కెపాసిటీని 50 శాతానికి పెంచుతున్నారు. వర్కింగ్ అవర్స్ని కూడా క్రమంగా పెంచుతామని షార్జా ప్రభుత్వ మీడియా బ్యూరో వెల్లడించింది. ఖచ్చితమైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని కార్యాలయాల నిర్వహణ జరుగుతోందని అధికారులు తెలిపారు. సోషల్ డిస్టెన్సింగ్, తప్పనిసరి మాస్క్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగులు ఇంటి నుంచే పని నిర్వహించేలా కూడా అవకాశం కల్పించారు. 9వ గ్రేడ్ అంత కంటే తక్కువ వయసున్న పిల్లలు కలిగిన తల్లులు, ప్రెగ్నెంట్ మహిళలు, క్రానిక్ డిసీజెస్తో బాదపడుతున్నవారిని రిస్క్ గ్రూప్స్ కింద భావించి, వారికి ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు ఇచ్చారు. షార్జా హ్యామన్ రిసోర్సెస్ డైరెక్టరేట్ హెడ్ డాక్టర్ తారిక్ సుల్తాన్ బిన్ ఖాదిం మాట్లాడుతూ, వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఉద్యోగులకు ఓ గైడ్ అందించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







