50 శాతం కెపాసిటీతో షార్జా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ
- June 22, 2020
షార్జా:షార్జాలో ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం కెపాసిటీతో ప్రారంభమయిన విషయం విదితమే. ఈ కెపాసిటీని 50 శాతానికి పెంచుతున్నారు. వర్కింగ్ అవర్స్ని కూడా క్రమంగా పెంచుతామని షార్జా ప్రభుత్వ మీడియా బ్యూరో వెల్లడించింది. ఖచ్చితమైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని కార్యాలయాల నిర్వహణ జరుగుతోందని అధికారులు తెలిపారు. సోషల్ డిస్టెన్సింగ్, తప్పనిసరి మాస్క్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగులు ఇంటి నుంచే పని నిర్వహించేలా కూడా అవకాశం కల్పించారు. 9వ గ్రేడ్ అంత కంటే తక్కువ వయసున్న పిల్లలు కలిగిన తల్లులు, ప్రెగ్నెంట్ మహిళలు, క్రానిక్ డిసీజెస్తో బాదపడుతున్నవారిని రిస్క్ గ్రూప్స్ కింద భావించి, వారికి ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు ఇచ్చారు. షార్జా హ్యామన్ రిసోర్సెస్ డైరెక్టరేట్ హెడ్ డాక్టర్ తారిక్ సుల్తాన్ బిన్ ఖాదిం మాట్లాడుతూ, వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఉద్యోగులకు ఓ గైడ్ అందించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







