ఒమన్కి వచ్చే పర్యాటకులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి
- June 29, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, టూర్ మరియు ట్రావెల్ ఆఫీసులకు కొన్ని స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. దేశంలో టూరిజం సెక్టార్ మళ్ళీ పుంజుకోనున్న దరిమిలా, ఈ సూచనలు చేయడం జరిగింది. సుప్రీం కమిటీ చేసిన సూచనలకు ఇవి అదనం. ట్రావెలర్స్కి మెడికల్ సర్టిఫికెట్తోపాటు, ఇన్స్యూరెన్స్ని తప్పనిసరి చేశారు. అన్ని రిజర్వేషన్స్ కేవలం ఆన్లైన్ ద్వారా చేయాల్సి వుంటుందనీ, క్యాష్ పేమెంట్ని అనుమతించవద్దని మినిస్ట్రీ సూచించింది. 16 మంది కంటే ఎక్కువ సంఖ్యలో టూరిస్టుల్ని వుంచకుండా గ్రూప్స్ మెయిన్టెయిన్ చేయాల్సి వుంటుంది. వారిని కూడా సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలి. చెక్ ఇన్ సమయంలో ప్రత్యేకంగా పెన్స్ని వినియోగించాలి. వెయిటింగ్ రూమ్స్ టెంపరరీ చెయిర్స్, వాటర్ బాటిల్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి వుంటుంది. ట్రావెలర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయడంతోపాటుగా, డిజిటల్ థర్మామీటర్తో వారి ఉష్ణోగ్రతల్ని పరిశీలించి, నమోదు చేయాలి. బఫెట్ సిస్టమ్ దగ్గర కూడా సేఫ్ డిస్టెన్స్ మెయిన్టెయిన్ చేసేలా చూడాలి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







