ఒమన్కి వచ్చే పర్యాటకులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి
- June 29, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, టూర్ మరియు ట్రావెల్ ఆఫీసులకు కొన్ని స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. దేశంలో టూరిజం సెక్టార్ మళ్ళీ పుంజుకోనున్న దరిమిలా, ఈ సూచనలు చేయడం జరిగింది. సుప్రీం కమిటీ చేసిన సూచనలకు ఇవి అదనం. ట్రావెలర్స్కి మెడికల్ సర్టిఫికెట్తోపాటు, ఇన్స్యూరెన్స్ని తప్పనిసరి చేశారు. అన్ని రిజర్వేషన్స్ కేవలం ఆన్లైన్ ద్వారా చేయాల్సి వుంటుందనీ, క్యాష్ పేమెంట్ని అనుమతించవద్దని మినిస్ట్రీ సూచించింది. 16 మంది కంటే ఎక్కువ సంఖ్యలో టూరిస్టుల్ని వుంచకుండా గ్రూప్స్ మెయిన్టెయిన్ చేయాల్సి వుంటుంది. వారిని కూడా సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలి. చెక్ ఇన్ సమయంలో ప్రత్యేకంగా పెన్స్ని వినియోగించాలి. వెయిటింగ్ రూమ్స్ టెంపరరీ చెయిర్స్, వాటర్ బాటిల్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి వుంటుంది. ట్రావెలర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయడంతోపాటుగా, డిజిటల్ థర్మామీటర్తో వారి ఉష్ణోగ్రతల్ని పరిశీలించి, నమోదు చేయాలి. బఫెట్ సిస్టమ్ దగ్గర కూడా సేఫ్ డిస్టెన్స్ మెయిన్టెయిన్ చేసేలా చూడాలి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







