దుబాయ్:జులై 5 నుంచి ఫెడరల్ ఉద్యోగులంతా విధులకు హజరుకావాలని ఆదేశాలు
- June 30, 2020దుబాయ్:ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇక నుంచి విధులకు హజరుకావాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. జులై 5న ఉద్యోగలు తమ ఆఫీసులలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే..వారు అధికారిక కమిటీ ఆమోదించిన మెడికల్ రిపోర్ట్స్ ని ఆఫీసులలో సమర్పించాలి. గతంలో కొన్ని వర్గాల వారికి ఆఫీసులకు రాకుండా మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గర్భిణులు, పెద్ద వయస్కులు, 9వ గ్రేడ్ కన్న తక్కువ చదువుతున్న పిల్లల తల్లులకు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. ఈ నెల నుంచే 50 శాతం ఉద్యోగులతో సాధారణ సేవలు ప్రారంభించారు. ఇదిలాఉంటే 100 శాతం సిబ్బందితో దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 15 నుంచే ప్రారంభం అయ్యాయి. ఇక షార్జా ప్రభుత్వ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో సేవలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..