జులైలో మరో 15 డెస్టినేషన్స్తో ఎతిహాద్ విస్తరణ
- June 30, 2020అబుధాబి కేంద్రంగా పనిచేస్తోన్న ఎతిహాద్ ఎయిర్వేస్, మరో 15 డెస్టినేషన్స్ని వచ్చే నెలలో యాడ్ చేయనుంది. భారత ఉప ఖండంలో పలు ప్రముఖ నగరాల్ని ఇందులో పొందుపరిచారు. జూన్ 24న ఏథెన్స్, గ్రీస్లను లిస్ట్లో యాడ్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం 25 డెస్టినేషన్స్కి విమానాలు నడుస్తున్నాయి. కాగా, జులై 16 నుంచి భారత నగరాలైన బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైదరాబాద్, కోచి, కోజికోడ్ మరియు ముంబైలకు విమానాలు నడపనున్నారు. జులై 16 నుంచి మాల్దీవ్కి కూడా విమాన సర్వీసులు నడుస్తాయి. పాకిస్తాన్ విషయానికొస్తే, కేవలం ఇన్బౌండ్ విమానాలు మాత్రమే మూడు పాకిస్తానీ నగరాలు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లకు పరిమితం చేశారు. మిడిల్ ఈస్ట్లో అమ్మాన్ మరియు కైరోలకు జులై 16 నుంచి విమానలు నడుపుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికంటే ముందే ప్రయాణీకులు కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు