జులైలో మరో 15 డెస్టినేషన్స్తో ఎతిహాద్ విస్తరణ
- June 30, 2020
అబుధాబి కేంద్రంగా పనిచేస్తోన్న ఎతిహాద్ ఎయిర్వేస్, మరో 15 డెస్టినేషన్స్ని వచ్చే నెలలో యాడ్ చేయనుంది. భారత ఉప ఖండంలో పలు ప్రముఖ నగరాల్ని ఇందులో పొందుపరిచారు. జూన్ 24న ఏథెన్స్, గ్రీస్లను లిస్ట్లో యాడ్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం 25 డెస్టినేషన్స్కి విమానాలు నడుస్తున్నాయి. కాగా, జులై 16 నుంచి భారత నగరాలైన బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైదరాబాద్, కోచి, కోజికోడ్ మరియు ముంబైలకు విమానాలు నడపనున్నారు. జులై 16 నుంచి మాల్దీవ్కి కూడా విమాన సర్వీసులు నడుస్తాయి. పాకిస్తాన్ విషయానికొస్తే, కేవలం ఇన్బౌండ్ విమానాలు మాత్రమే మూడు పాకిస్తానీ నగరాలు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్లకు పరిమితం చేశారు. మిడిల్ ఈస్ట్లో అమ్మాన్ మరియు కైరోలకు జులై 16 నుంచి విమానలు నడుపుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికంటే ముందే ప్రయాణీకులు కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







