దుబాయ్: నూతన ఇండియన్ కాన్సుల్ జనరల్ గా అమన్ పూరి
- July 01, 2020
దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో కాన్సులేట్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విపుల్ స్థానే కొత్తగా కాన్సల్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు 'అమన్ పూరి'. ప్రస్తుతం UK లోని బర్మింగ్హామ్లోని ఇండియన్ కాన్సులేట్కు ఇన్చార్జిగా ఉన్న అమన్ పూరి(44) దుబాయ్లో తదుపరి కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా గా వ్యవహరించనున్నారు.
ఏప్రిల్ 2017 లో మిషన్ బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత కాన్సుల్ జనరల్ విపుల్ తన తదుపరి పోస్టింగ్ కోసం జూలై 7 న వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చే విమానంలో న్యూ ఢిల్లీ కి బయలుదేరుతారు. "జూలై మధ్యలో డాక్టర్ పూరి బాధ్యతలు స్వీకరిస్తారు" అని విపుల్ తెలిపారు.
అమన్ పూరి గురించి క్లుప్తంగా..
దంతవైద్యుడుగా పనిచేస్తున్న డాక్టర్ అమన్ పూరి భారత్ సర్వీసులపై గల ఆసక్తితో 2003 లో భారత విదేశాంగ సేవలో సభ్యుడిగా చేరారు.. 2005-08లో బ్రస్సెల్స్ కేంద్రంగా ఉన్న యూరోపియన్ యూనియన్, బెల్జియం మరియు లక్సెంబర్గ్ లకు భారత మిషన్లో పనిచేశారు. అతను చండీగఢ్ లోని పాస్పోర్ట్ కార్యాలయంలో 2009-10 నుండి ఒక సంవత్సరం పాటు పనిచేశారు.
తదనంతరం 2010-2013 వరకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ (సెరిమోనియల్) పదవిలో అమన్, భారత ప్రధానమంత్రి యొక్క విదేశీ సందర్శనలను, రాష్ట్రాల అధిపతులు, ఉపాధ్యక్షులు మరియు విదేశాంగ మంత్రులు, ప్రభుత్వ పెద్దల స్థాయిలో వచ్చే సందర్శనలను నిర్వహించడం వంటి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. అలాగే, డాక్టర్ పూరి 2013-16 నుండి న్యూ ఢిల్లీ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిగా ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?