భద్రతా కారణాలతో స్కూల్ మూసివేత
- February 02, 2016
అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిఇసి) ఘయాతిలోని వెస్టర్న్ మోడల్ ప్రైవేట్ స్కూల్ మూసివేతకు నిర్ణయం తీసుకుంది. భద్రతా ప్రమాణాల పరంగా అత్యంత అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలోనే ఈ స్కూల్ని మూసివేయాలని నిర్ణయించారు. ఎడిసిఇ ఓ ప్రకటనలో, ప్రైవేట్ స్కూల్స్ మరియు క్వాలిటీ ఎష్యూరెన్స్ (పిఎస్క్యుఎ) విభాగంలో స్కూల్తో అత్యవసరమైన నిర్వహణకు సంబంధించి చర్చలు జరిపింది. అలాగే స్కూల్ తమ సౌకర్యాలను మెరుగుపరచుకోవాల్సిందిగా ఆదేశించింది. ఎడిఇసి రూపొందించిన 2015 టెక్నికల్ రిపోర్ట్ ద్వారా స్కూల్ స్ట్రక్చర్ వెరీ పూర్ కండిషన్లో ఉందనీ దాంతో, అత్యంత దారుణమైన భద్రతా ప్రమాణాలున్నట్లుగా డిక్లేర్ చేయడమయ్యిందని అధికారులు చెప్పారు. 2015 జులో 20న మూసివేత డిక్రీ జారీ అయ్యింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ మూసివేత నిర్ణయం అమల్లో ఉంటుంది. మూసివేత కారణంగా 502 మంది విద్యార్థులు ఇబ్బందులు పడనున్నారని గుర్తించి, వారికి వివిధ స్కూళ్ళలో ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించారు. 216 మంది ఎమిరేటీ, అరబ్ స్టూడెంట్సని దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో, 282 మంది ఏసియన్ స్టూడెంట్స్కి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రవేశం ఇచ్చారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









