దోహా మున్సిపాలిటిలో 129 ఆహార ఉత్పత్తి కేంద్రాల మూసివేత
- July 04, 2020దోహా:నిబంధనలు పాటించని, పాడైన ఆహారం కలిగి ఉన్న దాదాపు 129 ఆహార కేంద్రాలను దోహా మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు అహార ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన మున్సిపాలిటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దోహా మున్సిపాలిటి పరిధిలో మొత్తం 15 వేల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. పాక్షికంగా పాడైపోయి అనారోగ్య కారకంగా మారిన అహారాన్ని ఉత్పత్తి చేస్తున్న 588 మందికి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అలాగే 490 అహార ఉత్పత్తి కేంద్రాలకు జరిమానాలు విధించామని అన్నారు. అలాగే వివిధ మాంసం ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. 10.5 టన్నుల పాడైపోయిన మాంసాన్ని గుర్తించి దాన్ని నాశనం చేశారు. అలాగే అనారోగ్యం కలిగించే స్థితిలో ఉన్న 1.3 టన్నుల చేప మాంసాన్ని కూడా నాశనం చేసినట్లు మున్సిపాలిటి అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్