దుబాయ్:185 మంది ప్రవాసుల కోసం ఛార్టర్డ్ విమానం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త
- July 04, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఓ వ్యాపారవేత్త పెద్ద మనసు చాటారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన చార్టీలు కూడా కట్టుకోలేని దయనీయస్థితిలో ఉన్న 185 భారత ప్రవాసులను తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా ఓ ఛార్టర్డ్ విమానం బుక్ చేసి ఇండియాకు పంపించారు. దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన ఈ విమానంలో గర్భిణీలు, వృద్ధులు, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు, చిన్న పిల్లలు ఉన్నారు.ఈ ఛార్టర్డ్ విమానాన్ని J&J మార్కెటింగ్ LLC మేనేజింగ్ డైరెక్టర్ జిజి వర్గీస్ ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందే విమానం వెళ్ళడానికి అనుమతించిన భారత కాన్సుల్ జనరల్ విపుల్. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమకు వర్గీస్ చేసిన ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేమని ఈ సందర్భంగా భారత ప్రవాసులు అన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







