దుబాయ్:185 మంది ప్రవాసుల కోసం ఛార్టర్డ్ విమానం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త
- July 04, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఓ వ్యాపారవేత్త పెద్ద మనసు చాటారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన చార్టీలు కూడా కట్టుకోలేని దయనీయస్థితిలో ఉన్న 185 భారత ప్రవాసులను తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా ఓ ఛార్టర్డ్ విమానం బుక్ చేసి ఇండియాకు పంపించారు. దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన ఈ విమానంలో గర్భిణీలు, వృద్ధులు, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు, చిన్న పిల్లలు ఉన్నారు.ఈ ఛార్టర్డ్ విమానాన్ని J&J మార్కెటింగ్ LLC మేనేజింగ్ డైరెక్టర్ జిజి వర్గీస్ ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందే విమానం వెళ్ళడానికి అనుమతించిన భారత కాన్సుల్ జనరల్ విపుల్. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమకు వర్గీస్ చేసిన ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేమని ఈ సందర్భంగా భారత ప్రవాసులు అన్నారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







