దుబాయ్:185 మంది ప్రవాసుల కోసం ఛార్టర్డ్ విమానం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త
- July 04, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఓ వ్యాపారవేత్త పెద్ద మనసు చాటారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన చార్టీలు కూడా కట్టుకోలేని దయనీయస్థితిలో ఉన్న 185 భారత ప్రవాసులను తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా ఓ ఛార్టర్డ్ విమానం బుక్ చేసి ఇండియాకు పంపించారు. దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన ఈ విమానంలో గర్భిణీలు, వృద్ధులు, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు, చిన్న పిల్లలు ఉన్నారు.ఈ ఛార్టర్డ్ విమానాన్ని J&J మార్కెటింగ్ LLC మేనేజింగ్ డైరెక్టర్ జిజి వర్గీస్ ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందే విమానం వెళ్ళడానికి అనుమతించిన భారత కాన్సుల్ జనరల్ విపుల్. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమకు వర్గీస్ చేసిన ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేమని ఈ సందర్భంగా భారత ప్రవాసులు అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







