గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో అల్లు శిరీష్
- July 04, 2020రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్ లో మొక్కలు నాటిన హీరో అల్లు శిరిష్. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పడున్న జీవినవిధానంలో పర్యవరణ పరిరక్షణ అత్యంత అవసరం. అందుకే విధిగా మనందరం స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విశ్వక్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నా మేనల్లుడు ఆర్నావ్ మేనకోడల్లు అన్విత, సమారా, నివ్రితిలను ఈ కార్యక్రమానికి నామినేట్ చేస్తున్నాను. రానున్న కొత్త తరానికి చెట్లను, ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం చాలా అవసరమని అన్నారు. అందుకే తన మేనల్లుడు, మేనకోడల్లకి ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటణ త్వరలోనే రాబోతుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..