కువైట్-ఇండియా మధ్య కొనసాగనున్న చార్టర్డ్ విమానాలు
- July 06, 2020కువైట్ సిటీ:అల్ తాయెర్ గ్రూప్, కువైట్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు మరిన్ని చార్టర్ విమానాల్ని నడపనుంది. కువైట్ ఎయిర్ వేస్ విమానం ఢిల్లీకి 322 మంది ప్రయాణీకులతో కూడిన విమానాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపింది. మరో కువైట్ ఎయిర్వేస్ విమానం ముంబైకి 268 మంది ప్రయాణీకుల్ని తీసుకెళ్ళింది. అల్ తాయెర్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్ వీటిని ఏర్పాటు చేశాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక నిబంధనల కారణంగా చార్టర్డ్ విమానాల నిర్వహణ కొంత ఆలస్యమవుతోంది. కాగా, ముంబైకి విమానాన్ని నడిపే క్రమంలో చొరవ చూపిన ఆదిత్య ఠాక్రేకి లగ్జరీ ట్రావెల్స్ ఆపరేషన్స్ మేనేజర్ బాబీ థామస్ కృతజ్ఞతలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ వివేక్ గైక్వాడ్ అలాగే తహసిల్దార్ అయుబ్ రషీద్ తంబోలీకి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చార్టర్డ్ విమానాల్ని నడుపుతామని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..