ప్రవాసీయులను ఆదుకున్న ఇన్ఫోసిస్
- July 07, 2020 
            బెంగళూరు: అసలే కరోనా కష్టకాలం.. అంతలో అమెరికాలో పని చేస్తున్న భారతీయులపై ట్రంప్ పిడుగు.. వీసా రెన్యూవల్కు దరఖాస్తు చేసుకున్న వారికి అదెప్పుడు ఆమోదం పొందుతుందో తెలీదు. కొందరికి గడువు కూడా పూర్తైపోయింది. పోనీ తిరిగి ఇండియాకు వద్దామా అంటే విమానాల రాకపోకలు నిలిపేశారు. ఇలా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ సంస్ధ నడుంబిగించింది.
ప్రత్యేక విమానంలో 206 మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సంస్ధ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ బోడే లింక్డ్ ఇన్ ద్వారా వెల్లడించారు. ‘కోవిడ్–19 మన జీవితాలపై ఊహించని స్ధాయిలో ప్రభావం చూపింది. అమెరికాలో పని చేస్తున్న కొందరు ఇన్ఫోసిస్ ఉద్యోగుల వీసా గడువు ముగిసిపోయింది. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. అందుకే వారిని కుటుంబాలతో ఇండియాకు తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాం. వాళ్లు బెంగళూరుకు వచ్చేశారు కూడా. దీంతో కొన్ని వారాల డైలమాకు శుభం కార్డు పడింది’ అని బోడే రాసుకొచ్చారు.
ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక ప్రకారం కంపెనీకి అమెరికాలో 17,709 మంది ఉద్యోగులు ఉన్నారు. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో, చాలా మంది తమను తిరిగి స్వదేశానికి చేర్చాలని కంపెనీకి విన్నవించుకున్నారు. ఇండియాకు వచ్చిన 76 మంది ఉద్యోగులు హెచ్1బీ, ఎల్1 వీసాలతో కంపెనీ అమెరికా కార్యాలయంలో పని చేసేవారు. ట్రంప్ నిర్ణయంతో.. వీసాలు రెన్యువల్ కావనే భావనతోనే ఇన్ఫోసిస్ ఉద్యోగులను తిరిగి భారత్కు తెచ్చిందని సమాచారం.
ఉద్యోగులను ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారని తెలిసింది. ఆ తర్వాత చాలామంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు కంపెనీని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. భువనేశ్వర్లో వరదలు వచ్చినప్పుడు కూడా ఇన్ఫోసిస్ కంపెనీ చార్టర్ విమానంలో 500 మంది ఉద్యోగులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం







