బహ్రెయిన్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి

- July 09, 2020 , by Maagulf
బహ్రెయిన్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి

మనామా:మనామా లో గుండెపోటుతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన రాజిరెడ్డి కర్ర వేములవాడ మండలం ఆశ్ రెడ్డి పల్లి గ్రామ వాసి.అతని అంత్యక్రియలు కరోనా కారణంగా మరియు వారి ఆర్థిక స్థితిగతులు బాగా లేనందున వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతిని అంత్యక్రియలు తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షులు గవ్వల పల్లి వెంకట స్వామి మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా కరోనా వైరస్  విజృంభిస్తున్న సమయంలో సభ్యులందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జరిపించగలిగారు. ఇందుకుగాను  ఇండియన్ ఎంబసీ, ఐ.సి.ఆర్.ఎఫ్ మరియు మరియు  తెలంగాణ సంస్కృతి సంఘం  దాసరి మురళి(ఉపాధ్యక్షులు), సురేష్ బోళ్ల(ట్రెజరర్) మరియు సభ్యులు రాజారెడ్డి,  పోచయ్య గంగాధర్, శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com