ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం
- July 10, 2020
బాహుబలితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి మన టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో యువ కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్లా చేయడానికి ప్లాన్ చేస్తుండటం విశేషం.
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం తనకు పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఫాంటసీ ఎలిమెంట్స్, వి.ఎఫ్.ఎక్స్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. యస్.వి.ఆర్ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.యస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని యస్.వి.ఆర్ నిర్మిస్తున్నారు.
ఇది వరకు ఆది సాయికుమార్ చేసిన చిత్రాలకు భిన్నంగా కామిక్ టచ్తో సాగే చిత్రమిది. మేకర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్పై దృష్టి పెట్టారు. పక్కా అందరినీ ఆకట్టుకునేలా స్క్రిప్ట్ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్లో చాప్టర్1 త్వరలోనే ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







