మస్కట్: ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్న షాపుల సీజ్
- July 10, 2020
కరోనా నేపథ్యంలో కొందరు వ్యాపారులు ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. అసలు ధరల కన్నా..రెట్టింపు ధరలకు సరుకులు అమ్ముతున్నారు. అలాంటి వారిపై వినియోగదారుల హక్కుల పరిరక్షణ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ ప్రాంతంలోని బర్కలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్నట్లు తనిఖీల్లో రుజువు కావటంతో ఓ షాపును సీజ్ చేశారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు తాము చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని, ఎవరైనా వ్యాపారులు ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రజలను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







