మస్కట్:కోవిడ్ కు ఔషధం కనిపెట్టామని అసత్యప్రచారం చేస్తే మూడేళ్ల జైలు శిక్ష
- July 12, 2020
మస్కట్:కోవిడ్ 19 వ్యాప్తి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అయితే..ఈ వైరస్ సంక్షోభ కాలంలో ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీగాళ్లు క్యాష్ చేసుకునేందుకు నకిలీ మాత్రలతో ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. కరోనా నివారణకు తమ దగ్గర దివ్యమైన ఔషధం ఉందని ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు ఔషధ సంస్థలు కూడా తాము మందును కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఒమన్ ప్రభుత్వం నకిలీ ప్రకటనలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. కరోనా నివారణకు మందులు కనిపెట్టామని ఎవరైనా క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఒమన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రజాహితం కాదని ఒమన్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







