మస్కట్:కోవిడ్ కు ఔషధం కనిపెట్టామని అసత్యప్రచారం చేస్తే మూడేళ్ల జైలు శిక్ష
- July 12, 2020
మస్కట్:కోవిడ్ 19 వ్యాప్తి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అయితే..ఈ వైరస్ సంక్షోభ కాలంలో ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీగాళ్లు క్యాష్ చేసుకునేందుకు నకిలీ మాత్రలతో ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. కరోనా నివారణకు తమ దగ్గర దివ్యమైన ఔషధం ఉందని ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు ఔషధ సంస్థలు కూడా తాము మందును కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఒమన్ ప్రభుత్వం నకిలీ ప్రకటనలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. కరోనా నివారణకు మందులు కనిపెట్టామని ఎవరైనా క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఒమన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రజాహితం కాదని ఒమన్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!









