యూఏఈ:గడువు ముగిసిన వీసాలపై స్పష్టత..
- July 13, 2020యూఏఈ:వీసాల రెన్యూవల్పై కీలక ప్రకటన చేసిన యూఏఈ ప్రభుత్వం.వీసాల రెన్యూవల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో యూఏఈ.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్కు సంబంధించి మూడు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ఆదేశించింది. ఈ క్రమంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ICA) జూలై 12 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కోసం ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. కార్యాలయాల్లో రద్దీ వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICA పేర్కొంది.
ICA వెబ్సైటు లింకు https://www.ica.gov.ae
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..