డాక్టర్ శ్రీరామ్‌ను అభినందిస్తూ ఉపరాష్ట్రపతి ట్వీట్

- July 14, 2020 , by Maagulf
డాక్టర్ శ్రీరామ్‌ను అభినందిస్తూ ఉపరాష్ట్రపతి ట్వీట్

ఢిల్లీ:కరోనా కారణంగా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్టర్‌పై తరలించిన డాక్టర్ పెండ్యాల శ్రీరామ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన.. కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లారు.వారి చొరవను అభినందిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శ్రీరామ్ చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని అభిలషించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com