తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీ..
- July 15, 2020
తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటల ఆధారంగా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీ "అసలేం జరిగింది" పాటలకు ఆడియన్స్ నుంచి చక్కటి స్పందన వస్తుందని చిత్ర నిర్మాత కింగ్ జాన్సన్ తెలిపారు. విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవిక, రాంకీ, భార్గవి పిళ్లై వంటి ప్రముఖ సింగర్లు పాడిన పాటలకు అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, యాపిల్ మ్యూజిక్ వంటి ఓటీటీ ప్లాట్ఫారమ్స్ నుంచి చక్కటి రెస్సాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చిందని, థియేటర్లు తెరుచుకునేంతవరకూ వేచి చూడాలా? లేక ఓటీటో ప్లాట్ఫారమ్స్లో రిలీజ్ చేయాలా? అనే విషయాన్ని అంతర్గతంగా చర్చిస్తున్నామని వివరించారు. ఎందుకంటే సినిమా అనుకున్నదానికంటే రిచ్గా వచ్చిందని, 8కే రిజల్యూషన్ కెమెరాతో రూపొందించిన ఈ సినిమాకు ప్రముఖ బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ ఎస్.చిన్నా ప్రాణం పోశారని, సేతు స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివి ప్రేక్షకుల్ని చివరి వరకూ ఉత్కంఠను కలిగిస్తాయని తెలిపారు. మంచి పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న కథకు హీరో శ్రీరాం ప్రాణం పోశాడని, అతని నటనాప్రతిభను చూసి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకముందని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ యేలేంద్ర మహావీర్ స్వరకల్పనలో రూపొందించిన అసలేం జరిగింది సినిమా పాటలను ఆదిత్యా మ్యూజిక్ ఇటీవల విడుదల చేసింది. ఐదు విభిన్నమైన గీతాలకు ఆడియన్స్ నుంచి చక్కటి ఆదరణ లభిస్తుందని చిత్ర నిర్మాత నీలిమా చౌదరి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు