తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీ..
- July 15, 2020
తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటల ఆధారంగా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీ "అసలేం జరిగింది" పాటలకు ఆడియన్స్ నుంచి చక్కటి స్పందన వస్తుందని చిత్ర నిర్మాత కింగ్ జాన్సన్ తెలిపారు. విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవిక, రాంకీ, భార్గవి పిళ్లై వంటి ప్రముఖ సింగర్లు పాడిన పాటలకు అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, యాపిల్ మ్యూజిక్ వంటి ఓటీటీ ప్లాట్ఫారమ్స్ నుంచి చక్కటి రెస్సాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చిందని, థియేటర్లు తెరుచుకునేంతవరకూ వేచి చూడాలా? లేక ఓటీటో ప్లాట్ఫారమ్స్లో రిలీజ్ చేయాలా? అనే విషయాన్ని అంతర్గతంగా చర్చిస్తున్నామని వివరించారు. ఎందుకంటే సినిమా అనుకున్నదానికంటే రిచ్గా వచ్చిందని, 8కే రిజల్యూషన్ కెమెరాతో రూపొందించిన ఈ సినిమాకు ప్రముఖ బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ ఎస్.చిన్నా ప్రాణం పోశారని, సేతు స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివి ప్రేక్షకుల్ని చివరి వరకూ ఉత్కంఠను కలిగిస్తాయని తెలిపారు. మంచి పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న కథకు హీరో శ్రీరాం ప్రాణం పోశాడని, అతని నటనాప్రతిభను చూసి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకముందని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ యేలేంద్ర మహావీర్ స్వరకల్పనలో రూపొందించిన అసలేం జరిగింది సినిమా పాటలను ఆదిత్యా మ్యూజిక్ ఇటీవల విడుదల చేసింది. ఐదు విభిన్నమైన గీతాలకు ఆడియన్స్ నుంచి చక్కటి ఆదరణ లభిస్తుందని చిత్ర నిర్మాత నీలిమా చౌదరి తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







