నిరసన వ్యక్తం చేసిన 12 మంది వలసదారుల అరెస్ట్
- July 15, 2020
కువైట్ సిటీ:నిరసన తెలిపే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిపై దూషణలకు దిగిన కారణంగా 12 మంది ఈజిప్టియన్ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 60 మందికి పైగా వలసదారులు అబు ఫతైరాలోని మేన్ పవర్ డిపార్ట్మెంట్స్ వద్ద గుమికూడి, తమ వేతనాల విషయమై ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడంలేదని ఆందోళన చేశారు వలసదారులు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని, వలసదారులు గవర్నమెంట్ కాంట్రాక్టులతో పనిచేస్తున్నారనీ, వారికి సేలరీలు అందడంలేదని గుర్తించారు. కాగా, ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ బ్రిగేడియర్ జనరల్, ముబరక్ మర్జి బ్రిగేడియర్ జనరల్, వలసదారుల ఫిర్యాదుల్ని స్వీకరించారు. వారి సమస్యల్ని మ్యాన్ పవర్ అథారిటీకి తెలియజేస్తామని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







