భారత్ నుండి యూ.ఏ.ఈకి తిరిగి వచ్చే ప్రయాణికులకు COVID-19 PCR పరీక్ష తప్పనిసరి

- July 16, 2020 , by Maagulf
భారత్ నుండి యూ.ఏ.ఈకి తిరిగి వచ్చే ప్రయాణికులకు COVID-19 PCR పరీక్ష తప్పనిసరి

అబుధాబి,దుబాయ్‌లకు ప్రయాణించే భారతీయులు బయలుదేరే 96 గంటల ముందు కొవిడ్-19 పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి. షార్జాకు ప్రయాణించే ప్రవాసుల కోసం, బయలుదేరే ముందు 72 గంటల కంటే ముందుగానే పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ తీసుకోవాలి. ఇంకా, ప్రభుత్వం ఆమోదించిన ప్రయోగశాల నుండే పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.

భారతీయులను యూ.ఏ.ఈకి తిరిగి పంపే విమానాలను నడుపుతున్న ఐదు విమానయాన సంస్థలలో మూడు యూ.ఏ.ఈ విమానయాన సంస్థలు ఉన్నాయి మరియు ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్నవారు జూలై 12 నుండి 26 వరకు యూ.ఏ.ఈకి తిరిగి రావాలి. ఇది ఇరు దేశాల పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం .

ప్రత్యేక విమానాలలో యూ.ఏ.ఈ కి తిరిగి ప్రయాణించిన ప్రయాణీకులు కొంతమంది నివాసితులు విమానంలో ఎక్కడానికి అనుమతించబడలేదు. ఎందుకంటే వారి పరీక్షలు గుర్తింపు లేని కేంద్రాల్లో జరిగాయి.

భారతదేశంలోని సర్టిఫైడ్ ల్యాబ్‌ల వివరాల కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యగలరు.
https://www.icmr.gov.in/./l./COVID_Testing_Labs_10072020.pdf

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com