అయోధ్య:ఆగస్టులో రామాలయ శంకుస్థాపన
- July 17, 2020
అయోధ్య:అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సర్వం సిద్ధం చేస్తుంది. ఆలయ శంకుస్థాపన తేదీని ఆదివారం ఖరారు చేయనున్నారు. శంకుస్థాపన పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ట్రస్టు సభ్యులు నిర్ణయించారు. మోదీకి ఆమోదంగా ఉన్న రోజున శంకుస్థాపనకు సిద్దం చేస్తామని అన్నారు. తేదీ ఖరారు చేసిన తరువాత ప్రధానికి ఆహ్వానం పంపిస్తామని.. మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా ఆహ్వానిస్తామని ట్రస్టు చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఆగస్టులో ఏదో ఒక రోజు శంకుస్థాపనకు సిద్దం అవుతున్నట్టు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతోపాటు.. చాలా మంది ప్రముఖులు పాల్గొంటారని ట్రస్టు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







