దోహా లో అనారోగ్య కారణంగా మృతి చెందిన ఏ.పి వాసి

- July 18, 2020 , by Maagulf
దోహా లో అనారోగ్య కారణంగా మృతి చెందిన ఏ.పి వాసి

#APNRTS #మరియు #వైఎస్ఆర్సీపీ  #వారి #సహకారంతో #స్వస్థలానికి #మృతదేహం .

#వైఎస్ఆర్సీపీ #గల్ఫ్ #ప్రతినిధి #మండా #వర్జిల్ #బాబు #అందించిన #సమాచారం #ప్రకారం

 

దోహా:పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపర్రు గ్రామానికి  చెందిన నల్లి రత్నరాజు( 51) అనారోగ్య కారణాల వలన 15 రోజుల క్రితం  ఖతార్ లో మృతి చెందినారు.రత్నం రాజు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఖతార్ లోని APNRTS కో-ఆర్డినేటర్, మరియు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు  ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ధీరజ్,  ICBF మెంబెర్ రజనీ మూర్తి తో మాట్లాడి ఎమిగ్రేషన్ మరియు పేపర్ వర్క్ పనులు పూర్తి చేయించారు.బాడి బాక్సు విమాన టికెట్ ఖర్చులు,రాయబార కార్యాలయం వారు సమకూర్చారు. నిన్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం ద్వారా, మృతదేహం హైదరాబాద్ కు పంపండం జరిగింది. ఖతార్ రాయబార కార్యాలయం వారికి మండా  వర్జీల్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 

అలాగే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మృతుని స్వస్థలం చంద్రపర్రు గ్రామానికి బి.హెచ్ ఇలియాస్(APNRTS డైరెక్టర్) సహకారంతో, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించినారు. 

మండా, వర్జిల్ బాబు మాట్లాడుతూ, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించిన మేడపాటి వెంకట్(APNRTS ఛైర్మన్),బి.హెచ్ ఇలియాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మృతదేహం స్వస్థలం చేరింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com