పాతికేళ్ళ యువకులకు క్యాబినెట్లో చోటు
- February 04, 2016
యూఏఈ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ట్విట్టర్ ద్వారా సంచలన ప్రకటన చేశారు. క్యాబినెట్లోకి గ్రాడ్యుయేషన్ పూర్తయిన ముగ్గురు యువకుల్ని, ముగ్గురు యువతుల్ని యూనివర్సిటీలు నామినేట్ చేయవచ్చని, వారిని మంత్రి వర్గంలోకి తీసుకుంటామని ప్రకటనలో పేర్కొన్నారు షేక్ మహమ్మద్. యువత దేశానికి వెన్నెముక అనీ, వారి ఆలోచనలు దేశాభివృద్ధికి ఉపయోగపడ్తాయని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పాతికేళ్ళలోపువారికి ఈ అద్భుత అవకాశం దక్కనుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ మరియు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ డాక్టర్ అబ్దుల్లా అల్ కరమ్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అన్నారు. దేశ అభివృద్ధిలో ఇదో కీలకమైన ముందడుగుగా ఆయన కొనియాడారు. షేక్ మహమ్మద్ నిర్ణయంపై యువత నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని యువత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







