ఏ.పీలో కొత్తగా 5,041 కరోనా పాజిటివ్ కేసులు

- July 19, 2020 , by Maagulf
ఏ.పీలో కొత్తగా 5,041  కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం 31,148 సాంపిల్స్‌ ని పరీక్షించగా 5,041 మంది కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 1106 మంది కోవిడ్‌ నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి లో 10, శ్రీకాకుళంలో 8 మంది, కర్నూల్‌ లో ఏడుగురు, విశాఖపట్నం లో ఏడుగురు, కృష్ణ లో ఏడుగురు , ప్రకాశం లో నలుగురు, అనంతపురం లో ముగ్గురు, కడప లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు , గుంటూరు లో ఇద్దరు , చిత్తూరు లో ఇద్దరు మరణించారు.


--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com