భారత్ లో 24 గంట‌ల్లో 40 వేల‌కు మించిన క‌రోనా కేసులు...

- July 20, 2020 , by Maagulf
భారత్ లో 24 గంట‌ల్లో 40 వేల‌కు మించిన క‌రోనా కేసులు...

న్యూ ఢిల్లీ:భారత దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల‌ వేగం అమెరికా, బ్రెజిల్‌ల‌ను త‌ల‌పిస్తోంది. దేశంలో గ‌డ‌చిన 24 గంటల్లో ఏకంగా 40,425 క‌రోనా వైర‌స్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం క‌రోనా సోకిన వారి సంఖ్య 11 లక్షల 18 వేల 43కు పెరిగింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 681 మంది మృతిచెందారు. ఈ వైరస్ కారణంగా భార‌త్‌లో ఇప్పటివరకు మొత్తం 27,497 మంది మరణించారు. ఇప్పటివరకు 7 లక్షల 87 మంది  క‌రోనా బారిన‌ప‌డ్డారు. క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల 90 వేల 459 కు పెరిగింది. ఒక రోజులో ఇది 17 వేల 80కి పెరిగింది. జూలై 19 వరకు దేశంలో మొత్తం ఒక కోటీ 40 లక్షల 47 వేల 908 క‌రోనా టెస్టులు చేసిన‌ట్లు ICMR తెలిపింది. ఆదివారం 2 లక్షల 56 వేల 39 క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com