అనుమతుల్లేని హజ్ యాత్రీకుల్ని తరలిస్తే జైలు, జరీమానా
- July 20, 2020
జెడ్డా: సౌదీ అరేబియా, అనుమతుల్లేకుండా హజ్ యాత్రికులని తరలిస్తే జైలు శిక్ష అలాగే జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సాధారణ పరిస్థితుల్లో 2 మిలియన్ మంది హజ్ యాత్ర చేస్తుంటారు. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సంఖ్యను చాలా తక్కువకు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మార్గంలో వచ్చేవారి సంఖ్య పెరిగే అవకాశం వుంటుంది గనుక, అక్రమంగా యాత్రీకుల్ని తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. వలసదారులెవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే, కొంతకాలం పాటు వారికి సౌదీలోకి ప్రవేశం లేకుండా నిషేధిస్తారు. అక్రమంగా యాత్రీకుల్ని తరలిస్తే 15 రోజుల జైలు శిక్షతోపాటు 10,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుంది. అత్యధికంగా 50,000 జరీమానాతోపాటు, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక్కో యాత్రీకుడికి 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







