అనుమతుల్లేని హజ్ యాత్రీకుల్ని తరలిస్తే జైలు, జరీమానా
- July 20, 2020
జెడ్డా: సౌదీ అరేబియా, అనుమతుల్లేకుండా హజ్ యాత్రికులని తరలిస్తే జైలు శిక్ష అలాగే జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సాధారణ పరిస్థితుల్లో 2 మిలియన్ మంది హజ్ యాత్ర చేస్తుంటారు. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సంఖ్యను చాలా తక్కువకు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మార్గంలో వచ్చేవారి సంఖ్య పెరిగే అవకాశం వుంటుంది గనుక, అక్రమంగా యాత్రీకుల్ని తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. వలసదారులెవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే, కొంతకాలం పాటు వారికి సౌదీలోకి ప్రవేశం లేకుండా నిషేధిస్తారు. అక్రమంగా యాత్రీకుల్ని తరలిస్తే 15 రోజుల జైలు శిక్షతోపాటు 10,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుంది. అత్యధికంగా 50,000 జరీమానాతోపాటు, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక్కో యాత్రీకుడికి 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







