అనుమతుల్లేని హజ్ యాత్రీకుల్ని తరలిస్తే జైలు, జరీమానా
- July 20, 2020
జెడ్డా: సౌదీ అరేబియా, అనుమతుల్లేకుండా హజ్ యాత్రికులని తరలిస్తే జైలు శిక్ష అలాగే జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సాధారణ పరిస్థితుల్లో 2 మిలియన్ మంది హజ్ యాత్ర చేస్తుంటారు. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సంఖ్యను చాలా తక్కువకు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మార్గంలో వచ్చేవారి సంఖ్య పెరిగే అవకాశం వుంటుంది గనుక, అక్రమంగా యాత్రీకుల్ని తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. వలసదారులెవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే, కొంతకాలం పాటు వారికి సౌదీలోకి ప్రవేశం లేకుండా నిషేధిస్తారు. అక్రమంగా యాత్రీకుల్ని తరలిస్తే 15 రోజుల జైలు శిక్షతోపాటు 10,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుంది. అత్యధికంగా 50,000 జరీమానాతోపాటు, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక్కో యాత్రీకుడికి 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?