ఇద్దరు మోసగాళ్ళకు ఆరేళ్ళ జైలు శిక్ష

- July 20, 2020 , by Maagulf
ఇద్దరు మోసగాళ్ళకు ఆరేళ్ళ జైలు శిక్ష

యూ.ఏ.ఈ:అబుధాబి క్రిమినల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌, ఇద్దరు ఆసియా జాతీయుల్ని మోసం కేసులో దోషులుగా తేల్చింది. కౌంటర్‌ఫిట్‌ కరెన్సీని కలిగి వున్నారనే అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. ఫేక్‌ యూరో నోట్స్‌ని అబుదాబీలోని ఓ మనీ ఎక్స్‌ఛేంజ్‌లో మార్చేందుకు యత్నిస్తుండగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 1,000 యూరోలను నిందితుడు మార్చగా, సదరు మనీ ఎక్స్‌ఛేంజ్‌ 41,000 దిర్హామ్ లను అతనికి ఇవ్వడం జరిగింది. అయితే, అవి ఫేక్‌ యూరోలుగా గుర్తించిన సదరు మనీ ఎక్స్‌ఛేంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ఆరేళ్ళ జైలు శిక్షతోపాటుగా 200,000 దిర్హావ్‌ుల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష పూర్తయ్యాక ఇద్దర్నీ దేశం నుంచి డిపోర్ట్‌ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com