తెలంగాణలో కొత్తగా 1,430 కరోనా పాజిటివ్ కేసులు

- July 21, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,430 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 1,430 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య  47,705 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 16,855 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 2,062 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య  36,385గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10, 891 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేడు కరోనాతో మరో ఏడుగురు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 429కి చేరింది. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో GHMC పరిధిలోనే 703 ఉన్నాయి. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com