భారత్‌లో 12లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

- July 22, 2020 , by Maagulf
భారత్‌లో 12లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 37,724 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,92,915కు చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకూ 7,53,050 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,11,133 చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి ఒక్కరోజులోనే 648 మందిని బలికొంది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరింది. కాగా మహరాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ మూడులక్షల మార్కును దాటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com