పంద్రాగస్టు వేడుకలకు కేంద్రం మార్గదర్శకాలు
- July 23, 2020
న్యూఢిల్లీ: ఆగస్టు 15 వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని పేర్కొంది. సిఎంలు జెండా వందనం చేస్తారని, పోలీస్, ఆర్మీ, పారామిలటరీ, ఎన్ సిసి దళాలు మార్చ్ ఫాస్ట్ చేయాలని సూచించింది. వేడుకల్లో భాగంగా మాస్క్ లు ధరించాలని స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కరోనా సేవలందించిన వారిని, వైరస్ నుంచి కోలుకున్నవారిని ప్రత్యేక ఆహ్వానితులుగా వేడుకలకు పిలువాలని కేంద్రం పేర్కొంది. ఇదే తరహాలో జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలోనూ వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది. రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించే విషయం గవర్నర్లే నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







