పంద్రాగస్టు వేడుకలకు కేంద్రం మార్గదర్శకాలు
- July 23, 2020
న్యూఢిల్లీ: ఆగస్టు 15 వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని పేర్కొంది. సిఎంలు జెండా వందనం చేస్తారని, పోలీస్, ఆర్మీ, పారామిలటరీ, ఎన్ సిసి దళాలు మార్చ్ ఫాస్ట్ చేయాలని సూచించింది. వేడుకల్లో భాగంగా మాస్క్ లు ధరించాలని స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కరోనా సేవలందించిన వారిని, వైరస్ నుంచి కోలుకున్నవారిని ప్రత్యేక ఆహ్వానితులుగా వేడుకలకు పిలువాలని కేంద్రం పేర్కొంది. ఇదే తరహాలో జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలోనూ వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది. రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించే విషయం గవర్నర్లే నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







