ఎల్లిపోతావురా మనిషి అంటూ అందమైన పాట తో స్వాతి రెడ్డి
- July 24, 2020
సప్త సముద్రాలూ ధాటి పర దేశ సంప్రదాయాల తో బ్రతుకుతున్న మన భారత దేశ సంప్రదాయాలు ఎప్పటికి మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ప్రతిరోజూ అంగ్లం లో మాట్లాడుతున్న మన తెలుగు భాషను ఎన్నడూ మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ఎన్నో అద్భుతమైన తెలుగు భాణీలతో స్వష్టమైన తెలుగు మాటలతో మన తెలుగు వాళ్ళని ఎపుడు అలరిస్తూనే ఉంది గాయని స్వాతి రెడ్డి. ఇప్పుడు మరొక అద్భుతమైన పాటతో మన ముందుకు వచ్చింది.
"ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓ నాడు ఈ భూమి వదిలేసి..... ఉండాలి రా కలిసిమెలిసి అర్రే ఉన్నన్నాళ్లు కొత్త తెలిసి" అంటూ మనసుకు హద్దుకునే పాటతో మనముందుకి వచ్చింది. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన మన భారత మాత తన బిడ్దలను కాచి కాపాడుతుంది. అలానే మనిషి పుట్టుక పుట్టిన మనం కష్ట కాలం అయినా కలిసి మెలిసి ఉండాలి అనే చెప్పే గొప్ప పాట ఇది. మానవత్వం మరిచి మనస్సాక్షి ని విడిచి స్వార్ధం, ద్వేషం తో బ్రతుకుతున్న మనుషుల గురించి చెప్తూ , ఈ జీవం కొన్నాల్లే, ఉన్నన్నాళ్ళు అందరితో కలిసి ఉండమని జీవిత పరమార్ధం తెలియజేస్తున్న పాట. ఇది పాట కాదు మేము మనుషులం అని ముసుగు వేసుకుని నటిస్తున్న మన అందరి ఆట
ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సాహిత్యం అందించగా లండన్ లో ఉంటున్న స్వాతి రెడ్డి గానం చేసారు. ఈ పాట చిత్రీకరణ అంత లండన్ లోనే జరిగింది. నాగోల్ బాల్ రెడ్డి మరియు లొంక నరేందర్ రెడ్డి ఈ పాటను నిర్మించారు. ఈ పాటని మన తెలుగు వారందరికీ అంకితం ఇస్తున్నారు.
లిరిక్ & మ్యూజిక్ - భీమ్స్ సిసిరోలియో
సింగర్ - స్వాతి రెడ్డి
ఆలప్ - ఫైజాన్ ఖాన్
ఎడిటర్ - శివ వై ప్రసాద్
కెమెరా - ఏం వి ప్రసాద్
నిర్మాత - నాగోల్ బాల్ రెడ్డి మరియు లొంక నరేందర్ రెడ్డి
మ్యూజిక్ కోఆర్డీనేటర్ - మాల్యా కందుకూరి
మిక్సింగ్ - ఎస్. కిశోర్ కుమార్
మస్టర్డ్ - ఆర్టిఫ్లెక్ స్టూడియో సిడ్నీ
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు