భారతదేశాన్ని సందర్శించనున్న బహ్రెయిన్ ఇండియా సొసైటీ

- February 05, 2016 , by Maagulf
భారతదేశాన్ని సందర్శించనున్న బహ్రెయిన్ ఇండియా సొసైటీ

 ఈ నెల 13 వ తీదీ నుండి 18 వ తీదీ వరకు ముంబై లో జరిగే ' మేక్ ఇన్ ఇండియా ' వారోత్సవంలో  'బహ్రెయిన్ ఇండియా సొసైటీ ' పాల్గొననుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరై , లాంఛనంగా ప్రారంభించనున్నారు. బహెరిన లో ఉన్న భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా  బహెరిన ఇండియా సొసైటీ ప్రతినిధి బృందానికి సకల సదుపాయాలు మద్దతును అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రాబోయే దశాబ్ధ కాలంలో భారతదేశం తయారీ రంగంలో సాధిస్తున్న అభివృద్ధి, డిజైన్, నూతన ఆవిష్కరణలు మరియు స్థిరత్వం తదితర అంశాలపై పరిశీలన, చర్చ జరగనుంది.  బహెరిన ఇండియా సొసైటీ లాభాపేక్ష లేని సంస్థ అని  రెండు దేశాల మధ్య వ్యాపార మరియు ఆర్ధిక సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నట్లు ' బిస్ ' సభ్యులు తెలిపారు. 

   
             

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com