జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం..

- February 05, 2016 , by Maagulf
జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు  ప్రారంభం..

 గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గ్రేటర్‌లో 150 డివిజన్లకు ఈనెల 2న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయమే ప్రారంభం కావాల్సి ఉండగా పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పురానాపూల్‌ రీపోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాతే అధికారికంగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. మొదటి అరగంటలో పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రారంభిస్తారు. దీనికోసం 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,626 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1674 టేబుళ్లు, 827 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com